TS TET Paper 1 (SGT) Previous Question Paper 20th June 2025 (Shift-1): EVS Free Online Test


30 ప్రశ్నలు (Qns)
30 నిమిషాలు (Mins)
30 మార్కులు (Marks)

ముఖ్యమైన సూచనలు (Instructions):

  • Syllabus: ఈ Test లో పర్యావరణ అధ్యయనాలు (EVS) 30 ప్రశ్నలు (including Methodology) ఉన్నాయి.
  • Exam Pattern: ఇది 20th June 2025 TS TET Paper-1 (Shift-1) EVS Subject అధికారిక ప్రశ్నాపత్రము.
  • Solved: ప్రతి ప్రశ్నకు ఆన్సర్లతో పాటు క్లియర్ వివరణ (Detailed Explanations) ఇవ్వడం జరిగింది.
  • Analysis: మీ స్కోర్ ను మరియు Preparation స్థాయిని వెంటనే సమీక్షించుకోవచ్చును.
  • Speed: 30 ప్రశ్నలను నిర్దేశిత సమయం (30 నిమిషాల) కంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని మరింత మెరుగుపరుచుకోండి.
  • Negative Marks: ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండవు.
Start EVS Test

మీ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించండి – withchari.in

Question 1 of 30
🟢 0 🔴 0
30:00
దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది: A) గురుత్వాకర్షణ బలం. B) భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి?
A మాత్రమే.
B మాత్రమే.
A మరియు B రెండూ.
A కాదు మరియు B కాదు.
భూమి గురుత్వాకర్షణ బలం వాతావరణాన్ని భూమికి దగ్గరగా పట్టి ఉంచుతూ గాలి సాంద్రతలో మార్పులకు కారణమవుతుంది. భూమి యొక్క భ్రమణం వల్ల 'కొరియాలిస్ ప్రభావం'ఏర్పడి గాలి దిశ మారుతుంది. అలాగే పరిభ్రమణం వల్ల కలిగే రుతువుల మార్పులు కూడా గాలి వీచే వేగాన్ని, దిశను ప్రభావితం చేస్తాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఏ ముఖ్యమైన కార్యాచరణగా కూడా ఉపయోగపడుతుంది?
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి.
రైతుల ఆర్థిక వ్యవస్థను పెంచడానికి.
ఉత్పత్తిదారుల వస్తువుల ధరలను పెంచడానికి.
సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచడానికి.
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వం తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. మార్కెట్‌లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వం బఫర్ స్టాక్ నుండి వస్తువులను విడుదల చేయడం ద్వారా ధరలను అదుపులోకి తెస్తుంది, సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చేస్తుంది.
చోళుల శాసనం ప్రకారం 'శాలభోగం' దేనిని సూచిస్తుంది?
జైన సంస్థలకు విరాళమిచ్చిన భూమి.
బ్రాహ్మణులకు బహూకరించిన భూమి.
పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమి.
దేవాలయాలకు బహూకరించిన భూమి.
చోళుల శాసనం ప్రకారం 'శాలభోగం' అంటే పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన భూమి. అలాగే, వెల్లన్ వాగై:- బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి; బ్రహ్మదేయం:- బ్రాహ్మణులకు కానుకగా ఇచ్చిన భూమి; దేవదాన / తిరునామట్టుక్కని:- దేవాలయాలకు బహూకరించిన భూమి; పల్లిచ్చందం:- జైన సంస్థలకు విరాళంగా ఇచ్చిన భూమి.
రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతనికి క్రింది వాటిలో దేనిని తరచుగా ఇవ్వాలి?
అన్నం.
ఐస్ క్రీం.
వెన్న పూసిన బ్రెడ్.
పాలకూర పప్పు.
పాలకూర మరియు పప్పు దినుసులలో ఐరన్ (ఇనుము) అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తుంది. అందుకే 'పాలకూర పప్పు' రవికి సరైన ఆహారం. అన్నం, బ్రెడ్ వంటివి శరీరానికి శక్తిని ఇచ్చే పిండి పదార్థాలను (Carbohydrates) మాత్రమే అందిస్తాయి, ఐరన్‌ను కాదు.
5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సమాన పరిమాణంలో ఉన్న రెండు కప్పులను తీసుకొని, ఒక కప్పులో సాధారణ కుళాయి నీటిని, మరొక కప్పులో ఉప్పు నీటిని సమాన పరిమాణంలో పోసి, రెండు కప్పులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడు. EVS ఉపాధ్యాయుడిగా ఈ ప్రయోగం కోసం మీరు విద్యార్థులకు ఇచ్చే "పరికల్పన” ఏది?
ప్రతి కప్పు పూర్తిగా ఘనీభవించడానికి పట్టిన సమయాన్ని నమోదు చేసి, నివేదిక రాయండి.
ఏది ముందుగా ఘనీభవిస్తుందో చూడటానికి ప్రతి 30 నిమిషాలకు కప్పులను గమనించండి.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచే ముందు రెండు కప్పుల ఉష్ణోగ్రతను కొలవండి.
ఉప్పు, నీటి ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉప్పు నీరు, కుళాయి నీటి కంటే నెమ్మదిగా ఘనీభవిస్తుంది.
పరికల్పన (Hypothesis) అంటే ఒక ప్రయోగానికి ముందే ఫలితాన్ని అంచనా వేస్తూ చేసే ఒక శాస్త్రీయమైన ముందస్తు ఊహ. ఇక్కడ ఉప్పు కలపడం వల్ల నీరు నెమ్మదిగా గడ్డకడుతుందని ముందే ఊహించడం పరికల్పన అవుతుంది. మిగిలిన ఆప్షన్లు ప్రయోగం చేసేటప్పుడు అనుసరించే విధానాలను సూచిస్తాయి.
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు?
ఆర్టికల్ 352.
ఆర్టికల్ 360.
ఆర్టికల్ 356.
ఆర్టికల్ 368.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ భావిస్తే, ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయవచ్చు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, పరిపాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆర్టికల్ 352 ➔ జాతీయ అత్యవసర పరిస్థితి; ఆర్టికల్ 360 ➔ ఆర్థిక అత్యవసర పరిస్థితి; ఆర్టికల్ 368 ➔ రాజ్యాంగ సవరణ పద్ధతి.
కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలను గుర్తించండి?
కాళీబంగన్, చానుధరో మరియు లోథాల్.
మొహెంజోదారో, షార్టుగై మరియు సుట్కాగేందర్.
కాళీబంగన్, రోపర్ మరియు హరప్పా.
కాళీబంగన్, రోపర్ మరియు లోథాల్.
ప్రస్తుతం హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు: భారతదేశం:- కాళీబంగన్ (రాజస్థాన్), రోపర్ (పంజాబ్), లోథాల్ (గుజరాత్), ధోలవీర (గుజరాత్), రాఖీగర్హి (హర్యానా). పాకిస్థాన్:- హరప్పా, మొహెంజోదారో, చానుధరో, సుట్కాగేందర్. ఆఫ్ఘనిస్తాన్:- షార్టుగై.
వరదల గురించి సరికాని (INCORRECT) వ్యాఖ్యను గుర్తించండి?
అర అడుగు లోతు వరద ఒక వ్యక్తిని కింద పడేలా చేస్తుంది.
ఒక అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా చేస్తుంది.
రెండు అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలను తుడిచిపెట్టేస్తుంది.
ఒక అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు.
ఒక అడుగు లోతు వరద నీటి ప్రవాహం అత్యంత ప్రమాదకరమైనది, ఇది మనుషులను పడదోయడమే కాకుండా చిన్న కార్లను కూడా కొట్టుకుపోయేలా చేస్తుంది. అందువల్ల వరద నీటిని తక్కువ లోతులో ఉన్నా కాలినడకన లేదా వాహనం ద్వారా దాటడం ఏమాత్రం సురక్షితం కాదు.
కింది జంతువులలో ద్విదా విచ్చిత్తి (Binary fission) ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏది?
అమీబా.
వానపాము.
సీతాకోకచిలుక.
కప్ప.
అమీబా వంటి ఏకకణ జీవులలో ద్విదా విచ్చిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఒకే మాతృకణం రెండు సమానమైన పిల్ల కణాలుగా విభజన చెందుతుంది. వానపాము, కప్ప మరియు సీతాకోకచిలుకలు బహుకణ జీవులు, ఇవి సంక్లిష్టమైన లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను అనుసరిస్తాయి.
సుంకర సత్యనారాయణ'తెలంగాణ' అనే బుర్రకథను రాశారు, ఇది దేనిపై దృష్టి పెట్టింది?
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు స్వాతంత్రం కోసం చేసిన వీరోచిత పోరాటం.
షేక్ బందగి అనే ముస్లిం రైతు చూపించిన వీరత్వం.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల చేసిన వీరోచిత పోరాటం.
హైదరాబాద్ రాష్ట్ర రజాకార్లపై ప్రజలు చేసిన వీరోచిత పోరాటం.
సుంకర సత్యనారాయణ1944లో రాసిన 'తెలంగాణ' అనే బుర్రకథ విస్నూరి దేశ్‌ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అరాచకాలు మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేదరైతు షేక్ బందగి సాహస పోరాట గాథను వివరిస్తుంది.
తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత (ppm లో) ఏ స్థాయిని మించి ఉంటే, అది పిల్లలలో దంత సమస్యలను కలిగిస్తుంది?
0.5
1.5
1
1.2
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత 1.5 ppm కంటే ఎక్కువగా ఉంటే అది డెంటల్ ఫ్లోరోసిస్‌కు దారితీస్తుంది. దీనివల్ల పిల్లల పళ్ళపై పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి దంతాలు బలహీనపడతాయి.
కింది వాటిలో దేనిని ఒక 'గొప్ప వృత్తం' అని పిలుస్తారు?
భూమధ్యరేఖ.
కర్కాటక రేఖ.
మకర రేఖ.
ఆర్కిటిక్ వలయం.
అక్షాంశాలన్నింటిలోకి భూమధ్యరేఖ అత్యంత పొడవైనది. భూమి గోళాకారంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండటం వల్ల, ఈ రేఖ వద్ద ఏర్పడే వృత్తం మిగిలిన అక్షాంశాల కంటే పెద్దదిగా ఉంటుంది. అందుకే దీనిని 'గొప్ప వృత్తం' (Great Circle) అంటారు. ఇది భూమిని సరిగ్గా రెండు సమాన భాగాలుగా (ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా) విభజిస్తుంది.
కింది వాటిలో కాకతీయులకు చెందని శాసనాన్ని గుర్తించండి?
మోటుపల్లి శాసనం.
ఉత్తర మేరూర్ శాసనం.
పాలంపేట శాసనం.
బయ్యారం శాసనం.
ఉత్తర మేరూర్ శాసనం చోళ రాజు 'మొదటి పరాంతకుడు' కాలానికి చెందినది. ఇది చోళుల కాలంలోని గ్రామీణ స్వపరిపాలన గురించి వివరిస్తుంది. మిగతా మూడు శాసనాలు కాకతీయులకు సంబంధించినవి. మోటుపల్లి శాసనం ➔ గణపతి దేవుడు; పాలంపేట శాసనం ➔ రేచర్ల రుద్రుడు; బయ్యారం శాసనం ➔ మైలాంబ వేయించారు.
కింది వాటిలో తేనెటీగ వృక్షజాలం (Bee flora) గా పరిగణించబడే మొక్కలను గుర్తించండి: A) అకాసియా (తుమ్మ) చెట్టు. B) ఆవాలు. C) పైన్. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి?
A & B మాత్రమే.
B & C మాత్రమే.
A & C మాత్రమే.
A, B & C.
తేనెటీగలు మకరందం మరియు పుప్పొడి కోసం ఆధారపడే మొక్కలను 'తేనెటీగ వృక్షజాలం' (Bee Flora) అంటారు. అకాసియా (తుమ్మ) మరియు ఆవాలు వంటి పుష్పించే మొక్కలు ఇందుకు సరైన ఉదాహరణలు. పైన్ చెట్లు పుష్పించవు, ఇవి గాలి ద్వారా పరాగసంపర్కం చెందుతాయి కాబట్టి ఇవి తేనెటీగ వృక్షజాలం కిందికి రావు.
కింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి ఏది?
బయోడీజిల్.
బొగ్గు.
సహజ వాయువు.
పెట్రోలియం.
బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు వంటివి తరిగిపోయే సాంప్రదాయ (శిలాజ) ఇంధన వనరులు. బయోడీజిల్ అనేది మొక్కలు లేదా జంతువుల కొవ్వుల నుండి తయారయ్యే పునరుద్ధరించదగిన సాంప్రదాయేతర ఇంధన వనరు. ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
ఒక ఐదవ తరగతి విద్యార్థి 'జంతువులు-మొక్కలు' అను పాఠమును చదివిన తరువాత తన పరిసరాలలో మొక్కలు పెంచుతున్నాడు, బడిలో తోటను పెంచుతున్నాడు, జంతువులు, పక్షుల యెడల ప్రేమ, సానుభూతిని చూపిస్తున్నాడు. ఈ కృత్యంలో ప్రతిబింబించే విద్యా ప్రమాణం ఏది?
సమకాలీన అంశాల పై ప్రతిస్పందన.
సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు.
ప్రశంస, సున్నితత్వము.
ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు.
ప్రకృతిలోని జీవజాలాన్ని గుర్తించి, వాటి పట్ల ప్రేమ మరియు దయను కలిగి ఉండటాన్ని 'ప్రశంస మరియు సున్నితత్వము' అనే విద్యా ప్రమాణంగా పేర్కొంటారు. మొక్కలు నాటడం, జంతువుల పట్ల సానుభూతి చూపడం వంటి పనులు విద్యార్థిలో పెరిగిన సామాజిక బాధ్యతను మరియు ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచిస్తాయి.
సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందిన యుగం ఏది?
పాలియోజోయిక్ యుగం.
మెసోజోయిక్ యుగం.
సెనోజోయిక్ యుగం.
ప్రీకాంబ్రియన్ యుగం.
మెసోజోయిక్ యుగాన్ని "సరీసృపాల యుగం" అని పిలుస్తారు. ఈ కాలంలోనే కొన్ని సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందడం ప్రారంభమైంది. సరీసృపాలకు మరియు పక్షులకు మధ్య సంధానకర్త (వారధి) గా భావించే ఆర్కియోప్టెరిక్స్ వంటి జీవులు ఈ యుగంలోనే ఉద్భవించాయి.
వేల సంవత్సరాలుగా, ఏ నది జలాలు ఈజిప్టు లోని భూములకు సాగునీరు అందించడానికి సహాయపడుతున్నాయి?
కాంగో నది.
నైలు నది.
జాంబేజీ నది.
చాడ్ నది.
నైలు నది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. ఈ నది అందించే సాగునీరు, సారవంతమైన ఒండ్రు మట్టి వల్లే ఎడారి ప్రాంతమైన ఈజిప్టులో వేల సంవత్సరాలుగా వ్యవసాయం సాధ్యమవుతోంది. ఈజిప్టు నాగరికత అంతా ఈ నది ఒడ్డునే వికసించింది. అందుకే ఈజిప్టును 'నైలు నది వరప్రసాదం' అని పిలుస్తారు.
పరిసరాల అధ్యయనము (EVS) లోని నిర్మాణాత్మక మదింపులో ముఖ్యంగా ఈ క్రింది సాధనాలను ఉపయోగిస్తారు: A) లఘు పరీక్షలు. B) వ్రాత పనులు. C) పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు. D) ప్రాజెక్టు పనులు. సరియైన దానిని గుర్తించుము?
A, B, C, D.
B, C, D మాత్రమే.
A, C, D మాత్రమే.
A, B, C మాత్రమే.
EVS లోని నిర్మాణాత్మక మదింపు (FA) లో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేయడానికి 4 సాధనాలను ఉపయోగిస్తారు: అవి1) పిల్లల భాగస్వామ్యం-ప్రతిస్పందనలు, 2) రాత పనులు, 3) ప్రాజెక్టు పనులు, 4) లఘు పరీక్ష.
కింది వాటిలో సహ-పాఠ్యాంశ కృత్యానికి (Co-curricular activity) ఉదాహరణను గుర్తించండి?
నాయకత్వం మరియు బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీని నిర్వహించడం.
వాతావరణ నమూనాలపై సైన్స్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేయడం మరియు ప్రదర్శించడం.
పర్యావరణ భావనలపై వ్రాత పరీక్ష రాయడం.
పర్యావరణ పరిరక్షణపై తరగతి గది ఉపన్యాసం వినడం.
సహ-పాఠ్యాంశ కృత్యాలు తరగతి గది బోధనకు అదనంగా ఉండి, విద్యార్థుల్లో సామాజిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు సృజనాత్మకతను పెంపొందిస్తాయి. మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన కలగడమే కాకుండా, వారిలో బహిరంగంగా మాట్లాడే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
1947 కి ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది?
ఇండియన్ ఐరన్ & స్టీల్ కంపెనీ (IISCO).
బొకారో స్టీల్ ప్లాంట్.
భిలాయ్ స్టీల్ ప్లాంట్.
టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ (TISCO).
1907లో జంషెడ్జీ టాటా ద్వారా జార్ఖండ్‌లోని సాక్షి (జంషెడ్‌పూర్) వద్ద TISCO స్థాపించబడింది. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో భారీ స్థాయిలో ఉక్కును ఉత్పత్తి చేసిన ఏకైక ప్రైవేట్ పరిశ్రమ ఇదే. IISCO 1918లో ప్రారంభమైనప్పటికీ, TISCO దేశ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఆగస్టు 1969లో అస్సాంలోని ఏ జిల్లాలను వేరుచేసి మేఘాలయ రాష్ట్రంగా సృష్టించబడింది?
ఖాసి, జాంటియా మరియు గారో హిల్స్.
బక్సా, బార్పేట మరియు గారో హిల్స్.
ఖాసీ, బార్పేట మరియు గారో హిల్స్.
జాంటియా, బార్పేట మరియు గారో హిల్స్.
1969లో అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అస్సాంలోని అప్పటి యునైటెడ్ ఖాసీ - జాంటియా హిల్స్ మరియు గారో హిల్స్ జిల్లాలను విడదీసి మేఘాలయను స్వయంప్రతిపత్తి గల ఉప-రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో దీనికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించింది.
పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారుగా ఎంత ఉంటుంది?
3 మీటర్ల పొడవు.
5 మీటర్ల పొడవు.
7 మీటర్ల పొడవు.
10 మీటర్ల పొడవు.
పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారు 7 మీటర్ల పొడవు ఉండి, జీర్ణవ్యవస్థలో అత్యంత పొడవైన భాగంగా పరిగణించబడుతుంది. ఇది కడుపులో చాలా చుట్టలు చుట్టుకుని ఒద్దికగా అమర్చబడి ఉంటుంది. ఇది ఆహారంలోని పోషకాలను రక్తంలోకి గ్రహించడంలో (శోషణ) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
ఏ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం, పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు?
మిశ్రమ వ్యవసాయం.
సేంద్రీయ వ్యవసాయం.
బహుళ పంటలు.
అంతర పంటలు.
ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించడంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా చేపట్టడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఇందులో ఆహార పంటలతో పాటు పశువులకు అవసరమైన పశుగ్రాస పంటలను కూడా పండిస్తారు. దీనివల్ల రైతుకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా,భూమి సారవంతం కావడానికి పశువుల ఎరువు కూడా ఉపయోగపడుతుంది.
ఈ క్రింది జాబితా-Aని జాబితా-Bతో జతపర్చండి. జాబితా- A (పాఠ్యాంశములు) జాబితా-B (సంబంధిత ఇతివృత్తములు) A) నీరు – అవసరాలు. i) వాతావరణం. B) బాలల హక్కులు. ii) కుటుంబం-సంబంధాలు. C) శక్తి. iii) ఆహారం-ఆరోగ్యం; పరిశుభ్రత. D) కుటుంబ వ్యవస్థ- మార్పులు. iv) విలువలు – హక్కులు. సరైన సమాధానాన్ని గుర్తించండి?
A-iii, B-i, C-iv, D-ii.
A-iii, B-iv, C-i, D-ii.
A-iv, B-iii, C-i, D-ii.
A-iv, B-i, C-ii, D-iii.
EVS పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలు నిర్దిష్టమైన ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డాయి. నీరు - అవసరాలు ➔ ఇది ఆహారం, ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు సంబంధించిన అంశం. బాలల హక్కులు ➔ ఇది విలువలు మరియు హక్కుల ఇతివృత్తం కిందికి వస్తుంది. శక్తి ➔ వాతావరణం, సూర్యుడు మరియు సహజ వనరులకు సంబంధించినది. కుటుంబ వ్యవస్థ ➔ కుటుంబం మరియు సామాజిక సంబంధాల ఇతివృత్తంపై ఆధారపడి ఉంటుంది.
కింది వ్యాఖ్యల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి: వ్యాఖ్య I : హిమాలయాల వంటి చల్లని ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. వ్యాఖ్య II : ఎడారుల వంటి వేడి ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు.
వ్యాఖ్య I మాత్రమే సరైనది.
వ్యాఖ్య II మాత్రమే సరైనది.
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సరైనవి.
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సరికానివి.
ఉన్ని దుస్తులు ఉత్తమ ఉష్ణ బంధకంగా పనిచేస్తాయి. ఇవి హిమాలయాల వంటి చల్లని ప్రాంతాలలో శరీర వేడి బయటకు పోకుండా వెచ్చదనాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఎడారి ప్రాంతాల్లో బయటి అధిక వేడి శరీరానికి తగలకుండా అడ్డుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
పరిసరాల విజ్ఞానం (EVS) బోధించడంలో ఉపాధ్యాయుని అతి ముఖ్యమైన పాత్ర ఏమిటి?
ఉపన్యాసాల ద్వారా సమాచారాన్ని అందించడం.
విద్యార్థుల అన్వేషణను మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడం.
తరచుగా క్విజ్‌ల ద్వారా విద్యార్థులను పరీక్షించడం.
ప్రధానంగా పాఠ్యపుస్తకాల కంటెంట్‌పై దృష్టి పెట్టడం.
EVS బోధనలో ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని ఇచ్చే వ్యక్తిగా కాకుండా, అభ్యసనాన్ని సులభతరం చేసే మార్గదర్శి (Facilitator) గా ఉండాలి. విద్యార్థులు స్వయంగా ప్రశ్నలు వేస్తూ, అన్వేషణ ద్వారా మరియు కృత్యాలలో పాల్గొంటూ నేర్చుకునేలా ప్రోత్సహించడం ఉపాధ్యాయుని అతి ముఖ్యమైన పాత్ర.
కిందివాటిలో స్పృహ కోల్పోయిన సందర్భంలో, వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స ఏది?
వ్యక్తిని నిటారుగా కూర్చోబెట్టి నీరు ఇవ్వడం.
కాళ్ళను పైకి లేపి, తలను పక్కకు వంచి, వాయుమార్గం తెరిచి ఉండేలా చూడడం.
చల్లటి నీరు చల్లి వ్యక్తిని కదిలించడం.
వ్యక్తిని దుప్పటితో కప్పి వేచి ఉండడం.
వ్యక్తి స్పృహ కోల్పోయినప్పుడు కాళ్ళను పైకి లేపడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. శ్వాస ఇబ్బంది లేకుండా తలను పక్కకు వంచి వాయుమార్గాన్ని (Airway) క్లియర్ చేయాలి. స్పృహలో లేని వారికి నీరు ఇవ్వడం ప్రమాదకరం, ఎందుకంటే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఏ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి?
సాత్పురా శ్రేణులు.
మహాదేవ్, కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగం.
పశ్చిమ కనుమలు.
నీలగిరి పర్వత శ్రేణులు.
దక్కన్ పీఠభూమి ఒక త్రిభుజాకార భూభాగం. దీనికి ఉత్తరాన సాత్పురా పర్వత శ్రేణులు, పశ్చిమ అంచున పశ్చిమ కనుమలు ఉండగా, తూర్పు అంచున మహాదేవ్ కొండలు, కైమూర్ శ్రేణులు మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగం విస్తరించి ఉండి తూర్పు సరిహద్దులుగా పనిచేస్తాయి.
భారతదేశంలో, జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం (సుమారుగా):
30%.
40%.
80%.
60%.
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో సుమారు 60% పాలను జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి వివిధ పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. మిగిలిన 40% పాలను ద్రవరూపంలో నేరుగా త్రాగడానికి మరియు టీ, కాఫీ వంటి అవసరాలకు వినియోగిస్తారు.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


TS TET Paper-I (SGT) EVS Subject 20-June-2025 (Shift-1)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top