TG TET Paper 2 (S1) TELUGU (5th January 2026) Previous Question Paper


30 ప్రశ్నలు (Qns)
30 నిమిషాలు (Mins)
30 మార్కులు (Marks)

ముఖ్యమైన సూచనలు (Instructions):

TG TET 2026 June Month లో జరిగే Exam Preparation కొరకు withchari.in లో Free గా online లో practice చేసుకోవడానికి 5th January 2026 Telangana TET social paper 2 Shift 1 కి సంబందించిన తెలుగు paper ని మీకు అందిస్తున్నాము.

ఈ TS Tet Previous Year తెలుగు Question Paper లో 30 Solved తెలుగు Questions (Bits) with Answers Keys (Solutions) అదేవిధముగా Clear and Detailed Explanations ని Telugu Medium లో మీకు అందించడం జరిగింది. ఇది మీ 2026 TG TET Exam కి ఎంతగానో ఉపయోగకరం.

  • Syllabus: ఈ Test లో Telugu Content 24 ప్రశ్నలు మరియు Methodology 6 ప్రశ్నలు ఉన్నాయి.
  • Exam Pattern: ఇది 5th January 2026 TS TET Social Paper- 2 (Shift-1) తెలుగు Subject అధికారిక ప్రశ్నాపత్రము.
  • Solved: ప్రతి ప్రశ్నకు ఆన్సర్లతో పాటు క్లియర్ వివరణ (Detailed Explanations) ఇవ్వడం జరిగింది.
  • Analysis: మీ స్కోర్ ను మరియు Preparation స్థాయిని వెంటనే సమీక్షించుకోవచ్చును.
  • Speed: 30 ప్రశ్నలను నిర్దేశిత సమయం (30 నిమిషాల) కంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని మరింత మెరుగుపరుచుకోండి.
  • Negative Marks: ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండవు.
Start తెలుగు Test

మీ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించండి – withchari.in

Question 1 of 30
🟢 0 🔴 0
30:00
“తెలుగులో హరివంశాలు” అనే అంశంపై పరిశోధన చేసినవారు ఎవరు?
ముదిగొండి సుజాతారెడ్డి.
మాదిరెడ్డి సులోచన.
పాకాల యశోదారెడ్డి.
టి.ఎన్.సదాలక్ష్మి.
ప్రసిద్ధ రచయిత్రి, పరిశోధకురాలు డా. పాకాల యశోదారెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "తెలుగులో హరివంశాలు" అనే అంశంపై పరిశోధన చేసి తెలుగులో డాక్టరేట్ పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఆమె తన పరిశోధనలో ఎర్రన, నాచన సోమన, భైరవ వంటి కవులు రచించిన హరివంశాలను తులనాత్మక అధ్యయనం చేశారు.
గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం ఏది?
హొన్ను.
రూపాయి.
వరహా.
దీనారం.
గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో బంగారు నాణేలను 'హొన్నులు' అని పిలిచేవారు. వీటితో పాటు పగడ (పావు హొన్ను), ఫణం వంటి నాణేలు కూడా చలామణిలో ఉండేవి. 'వరహా' అనేది విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన నాణెం కాగా, కుతుబ్ షాహీలు హొన్నులను ఎక్కువగా వాడేవారు.
క్రిందివాటిలో దృశ్య పరికరానికి ఉదాహరణ ఏది?
టేప్ రికార్డర్.
మెరుపు అట్టలు.
రేడియో.
ఆడియో క్యాసెట్లు.
మెరుపు అట్టలు (Flash Cards) కేవలం చూడటం ద్వారా సమాచారాన్ని గ్రహించే దృశ్య పరికరాలు. టేప్ రికార్డర్, రేడియో మరియు ఆడియో క్యాసెట్లు కేవలం వినడానికి మాత్రమే ఉపయోగపడే శ్రవణ పరికరాలు.
'రాజు సంతకు వెళ్లి కూరగాయలు కొన్నాడు' ఈ వాక్యంలో 'వెళ్లి' అనే పదం:
నామవాచకం.
సమాపకక్రియ.
అసమాపకక్రియ.
సంపూర్ణక్రియ.
వాక్యంలో పని ఇంకా పూర్తి కాలేదని తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటారు. ఇక్కడ 'వెళ్లి' అనేది పని అసంపూర్తిగా ఉందని తెలుపుతోంది (వెళ్లి ఏమి చేశాడు? అనే ప్రశ్న వస్తుంది). 'కొన్నాడు' అనేది పని పూర్తయిందని తెలిపే సమాపక క్రియ.
‘యజ్ఞం' అనే పదానికి గల వికృత పదమేది?
యానం.
ఎన్ను.
జన్నం.
ఏగు.
సంస్కృత పదాలను ప్రకృతి అని, వాటి నుండి స్వల్ప మార్పులతో పుట్టిన తెలుగు పదాలను వికృతి అని అంటారు. 'యజ్ఞం' అనే ప్రకృతి పదానికి 'జన్నం' అనేది వికృతి పదం.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చుఁ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ దిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చుఁ జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. పై పద్యం నుండి 'మృగతృష్ణలో నీరు త్రావవచ్చు' అంటే అర్థం ఏమిటి?
మృగాలున్నప్పుడు నీరు త్రాగవచ్చు.
ఎండమావిలో కూడా నీరు త్రాగవచ్చు.
ఎండా కాలంలో నీరు తాగాలి.
వాన కాలంలో నీరు వస్తుంది.
మృగతృష్ణ అంటే ఎండమావి అని అర్థం. ఎండమావిలో నీరు ఉండదు, అది కేవలం భ్రమ మాత్రమే. కానీ కవి అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయవచ్చని చెప్పే క్రమంలో "ప్రయత్నిస్తే ఎండమావిలో కూడా నీటిని కూడా త్రాగవచ్చు కానీ మూర్ఖుడి మనస్సును మాత్రం మార్చలేము" అని వివరించారు.
'మసజసతతగ' గణాలు కలిగిన పద్యమేది?
ఆటవెలది.
కందం.
మత్తేభం.
శార్దూలం.
వృత్త పద్యాలలో ఒకటైన శార్దూలంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో 'మ-స-జ-స-త-త-గ' అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి మరియు 13వ అక్షరం యతి స్థానంగా వస్తుంది. ప్రాస నియమం ఉంటుంది.
వెండి నగిషీ కళ ‘ఫెలిగ్రీ'కి ఏ ప్రాంతం పెట్టింది పేరు?
హైదరాబాద్.
కరీంనగర్.
పెంబర్తి.
మహబూబ్ నగర్.
వెండి తీగలతో అత్యంత సున్నితమైన మరియు అందమైన ఆభరణాలను, వస్తువులను తయారు చేసే 'ఫెలిగ్రీ' కళకు కరీంనగర్ జిల్లా ప్రపంచప్రసిద్ధి చెందింది. ఈ విశిష్టమైన హస్తకళకు 'కరీంనగర్ సిల్వర్ ఫెలిగ్రీ' పేరుతో భౌగోళిక గుర్తింపు (GI Tag) కూడా లభించింది.
ఆంగ్లంలోని 'లిటరేచర్' అనే పదానికి వాడుతున్న అర్థం ఏది?
లిఖిత, అలిఖిత సమాచారం.
సారస్వతం.
వాఙ్మయం.
అక్షరబద్ధమైన సమాచారం.
ఆంగ్లంలోని 'లిటరేచర్' అనే పదానికి 'అక్షరబద్ధమైన సమాచారమంతా' అనే అర్థాన్ని వాడుతున్నారు.
'ప్రళయ కాలమున సర్వము హరించువాడు' అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదాన్ని గుర్తించండి?
హరి.
హరుడు.
భవుడు.
గురువు.
'హరుడు' అంటే ప్రళయ కాలంలో సర్వమును హరించేవాడు (శివుడు) అని వ్యుత్పత్త్యర్థం. ఈ పదం శివుని యొక్క లయకారక స్వభావాన్ని, అంటే ప్రళయ సమయంలో సకల జగత్తును తనలో లీనం చేసుకునే స్థితిని తెలియజేస్తుంది.
విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరని అంశం ఏది?
విద్య, ఉపాధ్యాయ కేంద్రితంగా ఉండుట.
విద్య, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం.
విద్య, విద్యార్థి కేంద్రితంగా ఉండుట.
విద్య, ప్రగతికిబాటలు వేయటం.
ఆధునిక విద్యా విధానం మరియు విద్యాప్రణాళిక ఎప్పుడూ 'విద్యార్థి కేంద్రితంగా' ఉండాలి తప్ప 'ఉపాధ్యాయ కేంద్రితంగా' ఉండకూడదు. విద్యాప్రణాళిక అనేది విద్యార్థుల అవసరాలు, ఆసక్తులు మరియు సామర్థ్యాలను బట్టి రూపొందించబడాలి, అప్పుడే అది వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ప్రగతికి బాటలు వేస్తుంది.
పద్యబోధన ఉద్దేశాలలో ప్రధానమయినది ఏది?
ప్రతికూల వైఖరులను పెంపొందించుట.
స్వీయశైలిలో స్వీకరించకపోవుటను వృద్ధిపరచుట.
కవితా ప్రశంసన మార్గాలను తెలిపి, ఉత్తమ విమర్శకుల గావించుట.
ధారణాశక్తిని పెంపొందించకపోవుట.
పద్యబోధన యొక్క పరమార్థం కేవలం పదాల అర్థాలు చెప్పడం మాత్రమే కాదు. పద్యంలోని సౌందర్యాన్ని, ఛందస్సును, అలంకారాలను మరియు కవి హృదయాన్ని అర్థం చేసుకుని ప్రశంసించే శక్తిని విద్యార్థులలో కలిగించాలి. తద్వారా వారు సాహిత్యాన్ని విశ్లేషించే ఉత్తమ విమర్శకులుగా తయారవుతారు.
'హితేన సహితం సాహిత్యమ్' అనే నిర్వచనం సాహిత్యం గురించి ఏ భావాన్ని తెలుపుతుంది?
కేవలం వినోదాన్ని అందించే రచన.
అలిఖిత సమాచార రూపం.
మేలును చేకూర్చే / ఉపదేశాన్ని అందించే రచన.
చరిత్ర గ్రంథాలు మాత్రమే.
'హితేన సహితం సాహిత్యమ్' అంటే సమాజానికి మేలును (హితము) చేకూర్చేది అని అర్థం. అది లోక శ్రేయస్సును కాంక్షించి, ధర్మాన్ని మరియు నీతిని బోధించేదిగా ఉండాలని చెప్పబడింది.
తెలుగు నవలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా ప్రవేశపెట్టినది ఏమిటి?
లేఖా రచన.
పాత్రోచితయాస.
గొలుసుకట్టు రచన.
గ్రాంథిక భాష.
దాశరథి రంగాచార్య తన నవలల్లో పాత్రల స్వభావానికి మరియు వారు నివసించే ప్రాంతానికి తగినట్లుగా ఉండే 'పాత్రోచితయాస' (తెలంగాణ మాండలికం)ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆయన రాసిన 'చిల్లర దేవుళ్లు', 'మోదుగుపూలు' వంటి నవలల్లో తెలంగాణ జనజీవనాన్ని, ఇక్కడి ప్రజల సహజ ఉచ్చారణను ఆయన అత్యంత ప్రభావవంతంగా చిత్రించారు.
“ఆనందానుభూతితోపాటు, జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్తవలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి, మాతృభాష మానవుడికి ఒక సాధనమౌతుంది అని చెప్పవచ్చు" అని మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలిపినవారు ఎవరు?
పి.బి. బల్లార్డ్.
డబ్ల్యు. ఎమ్. రైబర్న్.
రవీంద్రనాథ్ టాగూర్.
మహాత్మాగాంధీ.
మాతృభాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ డబ్ల్యు. ఎమ్. రైబర్న్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభాష అనేది కేవలం భావ వినిమయానికి మాత్రమే కాకుండా, మనిషిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి మరియు జ్ఞాన సముపార్జనకు ఒక శక్తివంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రచయిత్రి ‘ఆంధ్ర యువతి మండలి' వ్యవస్థాపకులలో ఒకరు:
ఇల్లిందల సరస్వతీదేవి.
సరోజినీ నాయుడు.
బొమ్మ హేమాదేవి.
దుర్గాబాయి దేశముఖ్.
ఇల్లిందల సరస్వతీదేవి గారు ప్రసిద్ధ కథా రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త. ఈమె హైదరాబాద్‌లోని 'ఆంధ్ర యువతి మండలి' వ్యవస్థాపకులలో ఒకరు. 1982లో తన 'స్వర్ణకమలాలు' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న మొట్టమొదటి తెలుగు మహిళా రచయిత్రిగా గుర్తింపు పొందారు.
కింది వాటిలో ఏది ‘సాహిత్యం'లో చేర్చబడదు?
కవిత్వం.
కథ.
నిస్సారమైన భాషా నైపుణ్యం.
నవల.
కవిత్వం, కథ, నవల, నాటకం వంటివన్నీ సాహిత్యంలో భాగంగా పరిగణించబడతాయి. అయితే ఎటువంటి లోతైన అర్థం లేదా ప్రయోజనం లేని "నిస్సారమైన భాషా నైపుణ్యం" మాత్రం ఎన్నటికీ సాహిత్యం కాదు.
'గంగోదకం' ఏ సంధి ద్వారా ఏర్పడింది?
వృద్ధి సంధి.
యణాదేశ సంధి.
సవర్ణదీర్ఘ సంధి.
గుణ సంధి.
'గంగోదకం' అనే పదాన్ని విడదీస్తే: గంగ + ఉదకం = గంగోదకం. ఇక్కడ అకారానికి 'ఉ' పరమైనప్పుడు 'ఓ' కారం ఏకాదేశంగా వచ్చింది. సూత్రం:- అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా రావడాన్ని గుణ సంధి అంటారు.
“మనస్సులోని భావపరంపరను, ఏ పదాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో, అదే భాష", అని అభిప్రాయపడిన భాషావేత్త ఎవరు?
హాకెట్.
సెఫైర్.
రామచంద్రవర్మ.
నోమ్ చామ్ స్కీ.
రామచంద్రవర్మ గారి అభిప్రాయం ప్రకారం భాష అనేది కేవలం ఒక సంకేతం మాత్రమే కాదు, అది మన మనసులోని భావాలను ఇతరులకు చేరవేసే ఒక వాహనం. భావ వ్యక్తీకరణలో పదాల అమరిక మరియు వాటి అర్థవంతమైన ప్రయాణమే భాషగా ఆయన నిర్వచించారు.
'అరటితొక్క తొక్కరాదు' ఏ అలంకారానికి ఉదాహరణ?
ఛేకానుప్రాస.
లాటానుప్రాస.
యమకము.
వృత్త్యనుప్రాస.
అర్థ భేదం కలిగిన హల్లుల జంట వ్యవధానం (గ్యాప్) లేకుండా వెంటవెంటనే రావడాన్ని 'ఛేకానుప్రాస' అంటారు. ఇక్కడ 'తొక్క' (పండు మీద ఉండేది), 'తొక్కరాదు' (కాలు వేయకూడదు) అనే పదాలు అర్థ భేదంతో పక్కపక్కనే వచ్చాయి కాబట్టి ఇది ఛేకానుప్రాస అలంకారం.
శ్రవణ లోపాలకు కారణం కానిది ఏది?
అవధానంతో వినకపోవడం.
శ్రవణేంద్రియ సంబంధిత లోపాలుండుట.
అజాగ్రత్తగా వినడం.
మాట్లాడువారి కంఠస్వరం ఉచిత స్థాయిలో ఉండుట.
వినేవారికి వినబడేలా స్పష్టమైన మరియు తగిన స్థాయిలో కంఠస్వరం ఉండటం అనేది శ్రవణ ప్రక్రియకు దోహదం చేస్తుంది కానీ లోపం కలిగించదు. మిగిలిన మూడు అంశాలు (అవధానం లేకపోవడం, శారీరక లోపాలు, అజాగ్రత్త) శ్రవణ దోషాలకు లేదా వినడంలో ఆటంకాలకు ప్రధాన కారణాలవుతాయి.
క్రాంతదర్శులు ఎవరు?
రాజకీయ నాయకులు.
కావ్యం రాసే వాళ్ళు.
ఉపాధ్యాయులు.
సాహితీ అభిమానులు.
సాహిత్యంలో కావ్యం రాసే కవులను క్రాంతదర్శులుగా పేర్కొంటారు, ఎందుకంటే వారి రచనలు సమాజ శ్రేయస్సు కోసం కాలాతీతమైన సందేశాన్ని మరియు ఉపదేశాన్ని అందిస్తాయి.
'తొల్లిటి రాజులు' ఏ సమాస పదం?
ఉపమాన పూర్వపద కర్మధారయము.
విశేషణ పూర్వపద కర్మధారయము.
ఉపమాన ఉత్తరపద కర్మధారయము.
విశేషణ ఉత్తరపద కర్మధారయము.
'తొల్లిటి రాజులు' అనే పదానికి విగ్రహవాక్యం 'తొల్లిటివారైన రాజులు'. ఇక్కడ 'తొల్లిటి' (పూర్వకాలపు) అనేది విశేషణం. ఈ విశేషణం సమాసంలో మొదటి పదంగా (పూర్వపదంగా) ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది.
పి.వి. నరసింహారావు ఏ కలంపేరుతో కథారచన చేశారు?
నిసార్.
విజయ.
నగ్నముని.
రాధేయ.
పి.వి. నరసింహారావు గారు 'విజయ' అనే కలంపేరుతో అనేక కథలు మరియు రచనలు చేశారు. బహుభాషా కోవిదుడైన ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయి పడగలు' నవలను 'సహస్ర ఫణ్' పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. ఆయన రాసిన 'గొల్ల రామవ్వ' కథ తెలుగు సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందింది.
‘కర్దమం' అనే పదానికి గల సరైన అర్థాన్ని గుర్తించండి?
అడుసు.
అడుగు.
కదంబం.
ఎత్తు.
'కర్దమం' అనే సంస్కృత పదానికి తెలుగులో అడుసు లేదా బురద అని అర్థం. పద్మం (తామర పువ్వు) కర్దమంలో పుట్టినప్పటికీ అపవిత్రం కానట్లుగా, మనిషి కూడా కష్టాల్లో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే సందర్భాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చుఁ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ దిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చుఁ జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. ఈ పద్యం ఎవరి గురించి వివరిస్తున్నది?
కుందేలు.
సజ్జనులు.
తైలము.
మూర్ఖులు.
ఈ పద్యం మూర్ఖుల స్వభావాన్ని వివరిస్తుంది. అసాధ్యమైన పనులనైనా సాధించవచ్చు కానీ, మూర్ఖుని మనస్సును మాత్రం మెప్పించలేమని కవి ఇందులో స్పష్టం చేశారు.
కిందివానిలో ‘చేవ' అనే పదానికి నానార్ధం కానిదానిని గుర్తించండి?
సారము.
పొగరు.
ధైర్యము.
వగరు.
'చేవ' అనే పదానికి సారము, పొగరు, ధైర్యము, శక్తి, బలం వంటి అనేక నానార్థాలు ఉన్నాయి. కానీ 'వగరు' అనేది ఒక రుచికి సంబంధించిన పదం, దీనికి 'చేవ' అనే పదంతో ఎటువంటి అర్థపరమైన సంబంధం లేదు.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చుఁ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ దిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చుఁ జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. ఈ పద్యంలో 'నూనె' అని అర్థాన్నిచ్చే పదం ఏ పాదంలో ఉంది?
2వ పాదం.
4వ పాదం.
1వ పాదం.
3వ పాదం.
పద్యంలోని మొదటి పాదం అయిన తివిరి యిసుమున తైలంబు దీయవచ్చులో 'తైలంబు' అనే పదానికి అర్థం 'నూనె'.
పోతన రాసిన శతకం పేరేమిటి?
నారాయణ శతకం.
ఆంధ్ర నాయక శతకం.
దాశరథి శతకం.
విశ్వకర్మ శతకం.
సహజ పాండిత్యుడు అనే బిరుదు గల బమ్మెర పోతన 'నారాయణ శతకాన్ని' భక్తిరస ప్రధానంగా రచించారు. ఈ శతకంలోని ప్రతి పద్యం 'నారాయణ' అనే మకుటంతో ముగుస్తుంది. దాశరథి శతకం - కంచెర్ల గోపన్న; ఆంధ్ర నాయక శతకం - కాసుల పురుషోత్తమ కవి రాశారు.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చుఁ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ దిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చుఁ జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. 'మూర్ఖుని మనస్సును మాత్రం సమాధానపెట్టలేం' అనే భావాన్నిచ్చే పద్యపాదం ఏది?
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.
చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు.
తవిరి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు.
తివిరి మిసుమున తైలంబు తీయవచ్చు.
పద్యంలోని నాలుగవ పాదం "జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు" అంటే మూర్ఖులను మెప్పించడం లేదా వారిని ఒప్పించడం ఎవరి తరము కాదు అని అర్థం.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


TG TET Paper 2 (S1) TELUGU (5th January 2026) Previous Question Paper

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top